Indias COVID-19 vaccination: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి 50 వేల దిగువన నమోదయ్యాయి. కరోనా మరణాలు ఇటీవల 4 లక్షలు దాటిపోయాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌లో 35 కోట్ల డోసులతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవుతున్నా, వాటి గురించి ఆందోళన అక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 18,38,490 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 43,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,45,433కు (30 కోట్ల 5 లక్షల 45 వేల 433)కు చేరుకుంది. కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గినా, కోవిడ్19 మరణాలు మరోసారి పెరిగాయి. దేశవ్యాప్తంగా 955 మందిని కోవిడ్19 మహమ్మారి బలిగొంది. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య  4,02,005 (4 లక్షల 2 వేల 5)కు చేరుకుంది. భారత్‌లో ఇప్పటివరకూ 35 కోట్ల 12 లక్షల 21 వేల 306 డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.


Also Read: COVID-19 Vaccine: డెల్టా వేరియంట్‌పై Johnson and Johnson సింగిల్ డోసు టీకా ప్రభావం, 8 నెలలపాటు సేఫ్


గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 52,299 మంది కరోనాను జయించారు. గత ఏడాది నుంచి భారత్‌లో ఇప్పటివరకూ 2,96,58,078 (2 కోట్ల 96 లక్షల 58 వేల 078) మంది కరోనా బారి నుంచి కోలుకున్నారిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షల దిగువకు చేరింది. ఇండియాలో ప్రస్తుతం 4,85,350 (4 లక్షల 85 వేల 350) యాక్టివ్ కోవిడ్19 కేసులు ఉన్నాయి.


Also Read: Delta Plus Variant: డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఆందోళన చెందవద్దు, మరింత సమాచారం వస్తేనే స్పష్టత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook