కథువా ఘటనను మరువకముందే మరో ఘోరం వెలుగుచూసింది. ఏడాది కూడా నిండని పసికందును ఎత్తుకుపోయి ఓ దుర్మార్గుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని హత్య చేశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌లోని ఎంజి రోడ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు రాష్ట్రంలో, దేశంలో సంచలనంగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నగరంలోని రాజ్‌వాడా ఫోర్ట్‌ సమీపంలో గల ఓ భవనం బేస్‌మెంట్‌లో రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు బేస్‌మెంట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆ పసికందును భుజాన ఎత్తుకొని బేస్‌మెంట్‌కు తీసుకొచ్చినట్లు కనిపించింది. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు.



 


రాజ్‌వాడా ఫోర్ట్‌ సమీపంలో ఓ కుటుంబం బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. వారికి ఏడాది కూడా నిండని కుమార్తె ఉంది. గురువారం రాత్రి వాళ్ళందరూ ఫోర్ట్‌ ముందు నిద్రపోగా.. ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. సమీపంలోని ఓ భవనం బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమెను చంపేశాడు. శుక్రవారం మధ్యాహ్నం బేస్‌మెంట్‌లో షాప్ తెరవడానికి వెళ్లిన ఓ వ్యక్తి రక్తపుమడుగులో పడిఉన్న చిన్నారిని చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ కేసులో ఆ పాప మామను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్టు చేసింది. నేరం చేసిన తరువాత ఆ వ్యక్తి పాప తల్లితో తీవ్రంగా గొడవపడ్డారని పోలీసులు చెప్పారు.