ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు మాత్రమే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాయి. ప్రస్తుతం ఈ దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రయోగాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.12,500 కోట్ల రూపాయల సహాయాన్ని ఇస్రో కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ తొలి దశ పనుల్లో భాగంగానే ఇస్రో సిబ్బంది "క్రూ ఎస్కేప్ సిస్టమ్"ని రూపొందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకు తగ్గ అదనపు సాంకేతికను సమకూర్చుకొని.. తొలిసారిగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ద్వారా ప్యాడ్ అబార్ట్ ప్రయోగాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే దిశగా తాము వ్యవస్థలకు రూపకల్పన చేస్తున్నామని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. 


ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అదనపు తర్ఫీదునివ్వాలని కూడా ఇస్రో యోచిస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఈ పనులు జరుగుతాయి. అలాగే ఇలాంటి వ్యోమగామ యాత్రలకు ఉపయోగపడే జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3ని గత సంవత్సరమే విజయవంతంగా పరీక్ష చేయడం కూడా జరిగింది. గతంలో ఇలాంటి ప్రయోగాలను నాసా అనేక సార్లు చేసింది.