Jaipur Crime news: రాజస్థాన్(Rajasthan)లోని జైపూర్(Jaipur)లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళా యోగా టీచర్(Yoga Teacher) తన సహోద్యోగి ప్రైవేటు భాగాల(Male private parts)ను కోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ మహిళా యోగా టీచర్, మరొక యోగా గరువు చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 16న మహిళా యోగా టీచర్..తన సహోద్యోగిని డిన్నర్ కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో..అతడికి మత్తు మందు ఇచ్చింది. స్పృహా కోల్పోయిన తర్వాత అతడి మర్మాంగాలను కత్తితో కోసేసింది.


Also Read:లేడీ డాక్టర్‌పై అత్యాచారం... మరో లేడీ డాక్టర్‌కు లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రభుత్వ వైద్యుల అరెస్ట్


రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేసరికి ఆ మహిళ కనిపించకుండా పోయిందని బాధితుడు తెలిపాడు. వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు వివరించాడు. డిశ్చార్జి అయిన తర్వాత అతడు భాంక్రోటా పోలీసుల(Bhankrota Police)కు ఫిర్యాదు చేసినట్లు వాపోయాడు.ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె అలా ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook