వాషింగ్టన్‌ వేదికగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సదస్సు కోసం వాషింగ్టన్‌ వెళ్లిన జైట్లీ..  స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలపై అన్ని దేశాలు  ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకించడం హాస్యాస్పదమన్నారు.  కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తాయంటూ జైట్లీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ హెచ్‌1-బీ వీసాలపై భారతీయుల్లో నెలకొన్న ఆందోళనలను అమెరికా దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.