ఊహించిందే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అన్నీ తానై నడిపించి. .  చివరికి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి . .  18 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న జ్యోతిరాదిత్య సింధియా . .  కమలం పార్టీ (బీజేపీ) లో చేరారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ దళంలో చేరిపోయారు. జ్యోతిరాదిత్య సింధియాతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు కూడా బీజేపీ గూటికి చేరారు.  అంతకు ముందు ఢిల్లీలోని జ్యోతిరాదిత్య సింధియా .. నివాసంలో సందడి వాతావరణం కనిపించింది. వేలాది మంది కార్యకర్తలు ఆయన ఇంటికి వచ్చారు. 


Read Also: సుడిగుండంలో మధ్యప్రదేశ్ సర్కారు


మరోవైపు ఇవాళ( బుధవారం ) ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, జ్యోతిరాదిత్య సింధియాకు రాజ్యసభ సీటు కేటాయింపు, కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే లాంటి పలు అంశాలపై చర్చించారు. 


Read Also: రంగు పడింది.. !!


జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్ లో పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..   Read Also: కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో ఇదిగో.. !!