ఇద్దరూ సూపర్ స్టార్లే.. అందులో ఒకరు ఏ పాత్రనైనా చేసే విలక్షణ నటుడు కాగా, మరొకరు మాస్ ఇమేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నవారు. వారే కమల్ హాసన్, రజినీకాంత్. ఒకప్పుడు సినిమాల్లో పోటీపడ్డవారు.. ఇప్పుడు రాజకీయాల్లో పోటీ పడనున్నారు. రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించిన తరువాత రజినీకాంత్ తొలిసారి కమల్ హాసన్ తో వేదిక పంచుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నడిఘర్ సంఘం మలేషియాలో ఏర్పాటు చేసిన నైట్ షో కు కమల్, రజినీ హాజరయ్యారు. ఇద్దరూ ఒకేసారి వేదిక వద్దకు చేరుకోగానే అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ షోలో పలువురు తమిళనటులు కూడా పాల్గొన్నారు.


కాగా రజినీకాంత్ రాజకీయ పార్టీనీ స్థాపించనున్నట్లు ప్రకటించడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయనున్నట్లు చెప్పడం తెలిసిందే..! కమల్, రజినీ పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తూనే.. తనదైన శైలిలో స్పందించాడు. ఇటివంటి సమయంలో వీరిద్దరూ ఒకే  వేదికను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. కమల్ హాసన్ కేవలం రాజకీయాల్లో వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. కానీ రజినీకాంత్ పార్టీని కూడా స్థాపిస్తున్నట్లు, అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. అభిమానులు రజినీ-కమల్ కలిస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు.