కాంచీపురం కామకోటి మఠం పీఠాధిపతి, జయేంద్ర సరస్వతి(82) బుధవారం ఉదయం మృతి చెందారు. మరణ వార్తతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగళ్ జూలై 18, 1935లో జన్మించారు. ఆయన బాల్యనామం సుబ్రహ్మణ్య అయ్యర్. కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ పీఠాధిపతి. సుబ్రహ్మణ్య మాధవీయ అయ్యర్ ఆయనకు పూర్వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిచే నామినేట్ చేయబడ్డారు. పీఠాధిపతి అయిన తరువాత "శ్రీ జయేంద్ర సరస్వతి" గా మార్చి 24, 1954 నుండి పిలువబడుతున్నారు. ఈయన హిదూత్వం లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.