'కర్ణాటక ప్రఙ్ఞావంత జనతా పక్ష' పార్టీకి ఆటోగుర్తు కేటాయిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ తెలిపింది. ఇటీవల ఉపేంద్ర కర్ణాటక రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే..! తాాజాగా ఈ పార్టీకి జాతీయ ఎన్నికల సంఘం ఆటోగుర్తు కేటాయించింది. ఈ విషయాన్ని మీడియాకు చెప్పడానికి వచ్చిన ఉపేంద్ర ఆటోరిక్షాలో రావడం విశేషం.


ఆయన మాట్లాడుతూ.. 'ఎన్నికల సంఘం ఆటో రిక్షా గుర్తు కేటాయించడం సంతోషంగా ఉంది. ఆటోరిక్షా గుర్తు తమ పార్టీ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఉంద' ని చెప్పారు. ఈ గుర్తు ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించకుండా.. ఉన్న సమస్యలను తీర్చి పాలన కొనసాగించాలనే ఉద్దేశాన్ని తెలియాజేస్తుందని చెప్పారు.