Omicron scare: కేరళలో కొవిడ్ కొత్త వేరియంట్​ 'ఒమిక్రాన్' (Omicron in Kerala) విజృంభిస్తోంది. తాజాగా ఈ రాష్ట్రంలో 50 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని రాష్ట్ర ఆరోగ్య విభాగం వెల్లడించింది. దీనితో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 280కి పెరిగినట్లు పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త కేసుల్లో 45 మంది తక్కువ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చినట్లు తెలిపింది (New Omicron cases in Kerala) కేరళ ఆరోగ్య విభాగం. మరో 5 మంది మాత్రం రిస్క్ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చినట్లు వివరించింది. 


కరోనా భయాలతో ప్రభుత్వం అప్రమత్తం..


కేరళలో కొవిడ్​, ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. జనసమూహాలపై పరిమితులు విధించడం, పెళ్లిళ్లు, అంత్యక్రియలు, రాజకీయ సభలు, సంఘీక కార్యక్రమాలు, ఇతరత్ర కార్యక్రమాల్లో 75 మందికి మించకుండా ఉండాలని సూచించింది (Corona rules in Kerala) ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలకు పరిమితిని 150గా ఉంచింది.


కరోనా తీవ్ర రూపం..


దేశంలో కరోనా థార్డ్​ వేవ్​ సంకేతాలకు ఊతమిస్తూ పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 90 వేలకుపైగా కొవిడ్ కేసులు (Corona cases in India) నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసులు (Omicron cases in India) 2,630కి పెరగటం గమనార్హం.


Also read: Air India flight: విమానంలో కరోనా కలకలం.. 125 మందికి కొవిడ్ పాజిటివ్‌!


Also read: PM Security Breach: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. పంజాబ్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన కోవింద్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook