Air India flight: విమానంలో కరోనా కలకలం.. 125 మందికి కొవిడ్ పాజిటివ్‌!

Amritsar Airport: ఇటలీ నుంచి పంజాబ్​కు వచ్చిన ఎయిర్​ ఇండియా ప్రయాణికుల్లో 125 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 04:11 PM IST
Air India flight: విమానంలో కరోనా కలకలం.. 125 మందికి కొవిడ్ పాజిటివ్‌!

Amritsar Airport: ఇటలీ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన ఎయిర్​ ఇండియా విమానంలో (Air India Flight) 125 మంది ప్రయాణికులు కరోనా (Covid-19) బారినపడ్డారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్  డైరెక్టర్‌ వీకే సేథ్‌ (VK Seth) వెల్లడించారు. వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు.  ప్ర‌స్తుతం 125 మంది ప్ర‌యాణికుల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో పరీక్షలు తప్పనిసరి చేశారు.

దేశంలో గడిచిన 24 గంటల్లో 90,928 కొత్త కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. 200 రోజులలో ఇదే అత్యధికం. వైరస్ తో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కొవిడ్ మహమ్మారి నుంచి 19,206 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,85,401 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Also Read: India Corona Cases Today: దేశంలో కరోనా విలయం.. లక్షకు చేరువైన కొవిడ్ కేసులు- 325 మరణాలు

మరోవైపు దేశంలో ఒమిక్రాన్​ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం 495 ఒమిక్రాన్ కేసులు (omicron Cases in India) వెలుగుచూశాయి. 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630 కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో గరిష్టంగా 797 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News