Kerala Corona Update: కేరళలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా థర్డ్‌వేవ్ ఆందోళన తీవ్రమౌతోంది. భారీగా నమోదవుతున్న కేసుల నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)తీవ్రత మరోసారి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల కన్పిస్తుంటే..కేరళలో ప్రమాద తీవ్రత చాలా అధికంగా కన్పిస్తోంది. రాష్ట్రంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమై..కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 30 నుంచి రాష్ట్రంలో నైట్‌కర్ఫ్యూతో పాటు ఆదివారం లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించనుంది. స్వాతంత్య్ర దినోత్సవం, ఓనం వేడుకల కారణంగా రెండు వారాలు ఆదివారం లాక్‌డౌన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు తిరిగి సండే లాక్‌డౌన్(Lockdown)పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 


ఇక నుంచి రాష్ట్రంలో నైట్‌కర్ఫ్యూ(Night Curfew)అమలు కానుంది. రాత్రి 10 గంటల్నించి ఉదయం 6 గంటల వరకూ ఆంక్షలు అమలు కానున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్(Kerala cm Vijayan)విజ్ఞప్తి చేశారు. కేరళలో కరోనా డేంజర్ బెల్స్ మోగించడమే కాకుండా..కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)ఆందోళనను పెంచుతోంది. వరుసగా మూడవ రోజు రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు 30 వేలు దాటాయి. గత 24 గంటల్లో 32 వేల 801 కొత్త కేసులు నమోదవడం కలవరం కల్గిస్తోంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, కర్ణాటక, హర్యానాల్లో కూడా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.


Also read: West Bengal: ఈడీ సమన్లపై కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ మమతా బెనర్జీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook