Fire Breaks At Vallabh  Bhavan Secretariat In Bhopal:మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం భోపాల్ లో ఉన్న సెక్రెటెరియట్ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భోపాల్ పట్టణంలో ఉన్న వల్లభ్ భవన్ సెక్రెటెరియట్ లో భారీగా మంటలు వ్యాపించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఉవ్వెత్తున మంటలు ఎగిసిపోడుతున్నాయి. ఆ ప్రాంతంలో దగ్గమైన పొగలు వ్యాపించాయి. పదులు సంఖ్యలో ఫైరింజన్ లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. వెంటనే తగిన చర్యలు తీసుకొవాలని సెక్రెటెరియట్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. మంటలు చెలరేగడానికి గల కారణాలపై  అధికారులు ఆరా తీస్తున్నారు. 


Read More: Dubai Millionaires Wife Demand: నెలకు రూ. 2.5 కోట్లు ఇస్తేనే బిడ్డలను కంటా.. భర్తకు తెగేసి చెప్పిన భార్య... కారణమిదే..


శనివారం కావడంతో అధికారులు కానీ, భద్రత సిబ్బంది ఎక్కువ మంది సెక్రెటెరియట్ లో విధుల్లో లేకపోవడంతో కొంత మేరకు ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook