మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దివ్యాంగురాలైన ఓ మైనర్ బాలికపై మూడు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డారనే ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వసతి గృహం సౌకర్యం కలిగిన పాఠశాలలో చదువుకుంటున్న దివ్యాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం ఘటన అనంతరం పోలీసులు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో పాఠశాల వసతి గృహం మేనేజర్, అతడి భార్య కూడా ఉన్నారు.