Mauni Amavasya 2025 Muhurtham: అమావాస్య అశుభం అంటారు కానీ రేపు వచ్చే అమావాస్య మాత్రం అత్యంత పవిత్రమైనది. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది జనవరి 29వ తేదీన బుధవారం మౌని అమావాస్య వచ్చింది. ఈ అతి ముఖ్యమైన పర్వదినాన మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించాలి. ఈ ఒక్క రోజే దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మౌని అమావాస్య ప్రాధాన్యాలు .. విశేషాలు తెలుసుకుందాం!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rythu Bharosa: రైతులకు భారీ శుభవార్త.. బ్యాంకుల్లో రూ.569 కోట్లు పెట్టుబడి సహాయం జమ


సకల పాపాలు తొలగి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజలు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా బాట పడుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం తరలివస్తున్నారు. మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది వస్తున్నారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహా ఉత్సవంలో ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీన ఈ మహాక్రతువు ముగియనుంది. ఈ మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో ఏదో ఒక రోజు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతో అదృష్టమని.. సకల పాపాలు తొలగిపోతాయని.. ఎంతో పుణ్యం లభిస్తుందని హిందూవుల విశ్వాసం.


Also Read: Pay Revision Commission: 'రెండు పీఆర్సీలు పెండింగ్‌.. ఆర్టీసీ విలీనం కోసం 15 రోజులే గడువు: జేఏసీ


ఎన్నో జన్మల పుణ్యఫలం
మహా కుంభమేళాలో ఇప్పటికే అఘోరాలు, నాగ సాధువులతోపాటు సామాన్య భక్తులు ప్రయాగ్‌రాజ్ లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. కుంభమేళాలో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తండోపతండాలుగా తరలివస్తున్నారు. మహా కుంభమేళాలో రేపు బుధవారం రానున్న (జనవరి 29వ తేదీ) శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య అత్యంత విశిష్టమైనది. ఇలాంటి రోజు జీవితంలో ఒకేసారి లభిస్తుంది. అత్యంత అరుదైన  ఈ శుభ ముహుర్తంలో పుణ్యస్నానం ఆచరించడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నారు. గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని.. రాజ స్నానం అనంతరం దానధర్మాలు చేస్తే శుభం కలుగుతుందని విశ్వాసం. స్నానం తర్వాత పరమశివుడిని పూజించాలి. అనంతరం పూర్వీకులకు నీరాజనాలు అర్పించాలి. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. 


మౌని అమావాస్య రోజు స్నానానికి ముహూర్తం 
ఈ పవిత్రమైన మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. స్నానం అనంతరం పూర్వీకుల ఆత్మ శాంతి కోసం శ్రాద్ధ కర్మలు, తర్పణం చేయాలి. స్నానం చేయడానికి.. దానధర్మాలు చేయడానికి బుధవారం ఉదయం 5:25 గంటల నుంచి ఉదయం 6:18 గంటల వరకు సమయం బ్రహ్మాండమైన ముహూర్తం. అయితే ఈ సమయంలో కుదరకపోతే తర్వాత కూడా స్నానం చేయొచ్చు. మౌని అమావాస్య రోజు రాత్రి 9:22 గంటల వరకు సిద్ధి యోగం కూడా ఉంటుంది. ఈ రోజంతా స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.