తమిళనాడు: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలికపై 11 మంది మృగాళ్లు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. కోవై ఆనైకట్టి ప్రాంతానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన ఇందూజ ఈ నెల 19న తిరునాళ్లకు అని చెప్పి.. తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లింది. ఎంతసేపటికీ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పలుచోట్ల వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను కాపాడారు. ఇందూజ ఆ బాలికను 11 మంది యువకుల వద్ద వదిలేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు బాలికను నాలుగు రోజుల పాటు గదిలో బందించి దారుణానికి ఒడిగట్టారు. బాలికపై దారుణానికి ఒడిగట్టిన మొత్తం 11 మందిని, ఇందూజను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బాలికను ఆసుపత్రికి తరలించారు. నిందితులను మన్నర్‌ న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తీసుకెళుతుండగా ఓ నిందితుడు పరారయ్యాడు. మిగిలినవారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పరారయిన నిందితుడికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.