'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు చేయిచేయి కలుపుదామని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు.  వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జనతా కర్ఫ్యూ ను దేశవ్యాప్తంగా విధించామని తెలిపారు. ఐతే వైరస్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవాలంటే మరోసారి లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: 'కరోనా'పై గాయని కరుణ హృదయం


లాక్ డౌన్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. 'కరోనా వైరస్' ను తేలిగ్గా తీసుకోవద్దని తెలిపారు. అధికారులు, వైద్య సిబ్బంది ఇచ్చిన సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని కోరారు.  ప్రజలు తమ కోసం తమ కుటుంబాల కోసం మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేశారు.



10 నిముషాల్లోనే ''కరోనా వైరస్'' పరీక్ష..!!


కరోనా వైరస్ విస్తరించిన 17 రాష్ట్రాలు, 5 కేంద్ర  పాలిత ప్రాంతాల్లో కేంద్రం లాక్ డౌన్ విధించింది. మార్చి 31 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది.  అవసరాన్నిబట్టి ఇతర ప్రాంతాలను కూడా లాక్ డౌన్ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..