అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ లో ఘన స్వాగతం లభించింది.  ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి  వచ్చి ఆయన్ను స్వాగతించారు. మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.  అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ తమ కళారూపాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో విమానంలో నుంచి దిగిన అధ్యక్షుడు ట్రంప్ ను ఘనంగా స్వాగతించారు మోదీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంచి మిత్రులు. భారత పర్యటకు వచ్చిన సందర్భంగా ట్రంప్ విమానాశ్రయంలో దిగగానే. . ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు మోదీ. మిత్రమా ..!! స్వాగతం .. వెల్ కమ్ టు ఇండియా అంటూ స్వాగతించారు.



Read Also: మొతేరా స్టేడియం చిత్రాలివిగో..