ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మిజోరాం లో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో  ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాని ఐజ్వాల్ లో 60 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు ను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ- ' ఏ సమస్య వచ్చిన మీరు ఢిల్లీకి రావక్కర్లేదు.. మీ వద్దకే అధికారులు వస్తారు' అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ప్రధాని మోదీ అక్కడివారికి ముందుగానే క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. వచ్చే ఏడాది మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నవేళ ప్రధాని పర్యటన సంతరించుకుంది. మోదీ ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ.. మరోవైపు బీజేపీ రాష్ట్రనేతలతో సమావేశమవుతూ బిజీబిజీగా గడపనున్నారు. మేఘాలయాలో మోదీ నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.