ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు బయల్దేరారు. ఢిల్లీ లో కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానం ఎక్కారు. ప్రత్యేక వాయు విమానంలో ఆయన బయల్దేరారు. ప్రస్తుతం జర్నీలో ఉన్నారు.  హైదరాబాద్ లోని బేంగంపేట విమానాశ్రయం లో ఫ్లైట్ లాండ్ అవుతుంది. మరో అర్థగంటలో ఆయన చేరుకుంటారు. మోదీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రోటోకాల్ అధికారులు బేగంపేట చేరుకోనున్నారు. మోదీ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో మెట్రో రైలు తో పాటు జీఈఎస్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. !