PM Modi Took His First Dose Of COVID19 Vaccine At AIIMS Delhi: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రధాని మోదీ తొలి డోసు కరోనా టీకా వేయించుకున్నారు. నేటి నుంచి 60 ఏళ్లు పైబడిన సామాన్యులకు, 45 నుంచి 59 ఏళ్ల వయసులో ఉండి దీర్ఘకాల వ్యాధులు ఎదుర్కొంటున్న వారికి టీకాలు నేటి ఉదయం ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్-19 వ్యాక్సిన్(COVID-19 Vaccine) తొలి డోసు తీసుకున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నాను. కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులైన అందరూ కచ్చితంగా టీకాలు తీసుకోండి. తద్వారా భారత్‌ను COVID-19 రహిత దేశంగా తీర్చిదిద్దుదామని’ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.


Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే



కాగా, నేటి ఉదయం ప్రధాని మోదీ(PM Narendra Modi) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న నివేదా ప్రధాని మోదీకి సిరంజీ ద్వారా కరోనా టీకా తొలి డోసు ఇచ్చారు. ఆ సమయంలో కేరళకు చెందిన మరో నర్సు కూడా ఉన్నారు. అసోంలో రూపొందించిన ఓ ప్రత్యేక కండువాతో మోదీ దర్వనమిచ్చారు. అంతా శుభాలే జరుగాలని భావించే సమయంలో ప్రధాని మోదీ ఈ కండువాను ధరిస్తారని తెలిసిందే.


Also Read: Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook