రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్‌లో రెండో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కంకర్ జిల్లాలో నేడు జరుగుతున్న పోలింగ్‌లో ఓ విషాదం చోటు చేసుకుంది. 186 నెంబర్ గల పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వహిస్తోన్న అధికారి ఒకరు హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. గుండెనొప్పితో బాధపడుతూ కుప్పకూలిన ఆయన్ను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.