ప్రధాన మంత్రి జనధన్ యోజన పథకం (పీఎంజేడీవై) కింద ఒక ఏడాది వ్యవధిలోనే అల్పాదాయ వర్గాలకు చెందిన 300 మిలియన్ల మంది ఖాతాదారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 32% బ్యాంక్ ఎకౌంట్స్ ఎస్బీఐ పరిధిలోనే ఉన్నాయని ఎస్బీఐ చైర్మన్ తెలిపారు. ప్రధానమంత్రి జనధన్ యోజన కింద రూ.1800 సగటుతో మొత్తం రూ.260 బిలియన్లు జమ కావడంతో అవి ఎస్బీఐకి లాభాల పంట పండిస్తున్నాయని ఎస్బీఐ చైర్మన్ పేర్కొన్నట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.