దేశంలోనే మొట్ట మొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ. . ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేస్తున్నారు. ఆమె రాజ్ భవన్ లో హోలీ సందర్భంగా చాలా ఉత్సాహంగా కనిపించారు. రాజ్ భవన్ లో హోలీ సంబరాలను ఘనంగా జరిపారు.



రాజ్ భవన్ సిబ్బంది, పోలీసు సిబ్బందితోపాటు ఆమె హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందరిపైనా పూలు చల్లుతూ. . సంప్రదాయ హోలీని నిర్వహించారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. ఈ సందర్భంగా పుదుచ్చేరీ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ఉత్సాహంగా హోలీ జరుపుకోవాలని సూచించారు. హోలీ సందర్భంగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..