జమ్ముకాశ్మీర్: పుల్వామా దాడికి సూత్రధారిగా భావిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాదిని భారత సైన్యం కాల్చిచంపింది. పుల్వామా జిల్లా పింగ్లన్ ప్రాంతంలో జరిగిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలపై జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు మృతిచెందగా సైనికులు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరిగా ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులు తలదాచుకున్న భవనాన్ని సైనికులు పేల్చేయగా అందులో తలదాచుకున్న ఉగ్రవాదుల్లో ఇద్దరు హతమైనట్టు తెలుస్తోంది. 


ఈ ఎన్‌కౌంటర్‌లో పుల్వామాదాడి కీలక సూత్రధారి జైషే మహ్మద్ కమాండర్ రషీద్‌ఘజీ, కమ్రాన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతూనే వున్నాయి.