న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఇస్లాం పాలకులకు వత్తాసు పలుకుతున్నాడని బీజేపీ నేత జివిఎల్ నరసింహారావు ఆరోపించారు. రాహుల్ గాంధీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జాఫర్యాబ్ జిలానీ, మజ్లీస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసి తో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. రాహుల్ బాబర్ భక్తుడని.. ఖిల్జీ వారసుడని తీవ్ర విమర్శలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఒవైసీ, జిలానీలతో జతకట్టారు. రాహుల్ గాంధీ ఖచ్చితంగా బాబర్ భక్తుడే.. ఖిల్జీ వారసుడే. బాబర్ రామ మందిరాన్ని కూల్చేస్తే.. ఖిల్జీ సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నారు. నెహ్రూ వంశం ఇస్లామిక్ ఆక్రమణదారుల వైపు నిలిచింది" అంటూ రావు ట్వీట్ చేశారు.