జైపూర్: రాజస్తాన్‌లో నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒకట్రెండు ప్రాంతాల్లో చెదురు ముదురు ఘటనలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ నిరంతరంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు 41.53% పోలింగ్ నమోదైంది. రాజస్తాన్‌కి చెందిన రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, అక్కడి రాజకుటుంబీకులు ఓటింగ్‌లో పాల్గొని సాధారణ ప్రజానికాన్ని సైతం ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నారు.