Rajasthan Road Accident: ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ నగరంలో నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ మీడియా ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ (Rajasthan Road Accident), జోధ్‌పూర్‌లోని డంగియావస్‌ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు, ట్రాక్టర్‌‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రాక్టర్ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు జోధ్‌పూర్ డీసీపీ (తూర్పు) భువన్ భూషణ్ యాదవ్ వెల్లడించారు. మృతులు అజ్మీర్‌ జిల్లావాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన జోధ్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Also Read: Hyderabad Petrol Price: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు, నేడు నిలకడగా డీజిల్ ధర



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook