Reserve Bank Of India | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారుల సంక్షేమం కోసం, వారి డబ్బు సురక్షితంగా ఉండేందుకు నిత్యం ప్రయత్నిస్తోంది. కొత్త కొత్త సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటోంది. వీటిని అమలులోకి తెచ్చి ఖాతాదారులు డబ్బు వారు అనుకున్న విధంగా బదిలి అయ్యేలా చూస్తోంది ఆర్బిఐ. తాజాగా చెక్ బుక్ మోసాలను అరికట్టేకందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దానికోసం పాజిటీవ్ పే విధానాన్ని తీసుకువచ్చింది. అందులో ముఖ్యాంశాలు ఇవే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు


కొత్త రూల్స్
ఆర్బిఐ (RBI) రూల్స్ ప్రకారం ఖాతాదారుడు ఎవరికైనా చెక్ ఇష్యూ చేస్తే వారు తప్పకుండా బ్యాంకు ఆ వివరాలు అందించాల్సి ఉంటుంది.


వివరాలు తప్పనిసరి
ఖాతాదారులు చెక్ ఎవరికి ఇష్యూ చేశాడు, చెక్ నెంబర్, చెక్ డేట్, పేయి పేరు, ఎకౌంట్ వివరాలు మొదలైనవి అందించాలి.


షేర్ చేయాల్సి ఉంటుంది
పైన అందించిన వివరాలతో పాటు చెక్కు రెండు వైపులా ఫోటో తీసి షేర్ చేయాల్సి ఉంటుంది. బెనిఫిషరీకి చెక్ ఇవ్వడానికి ముందే దాన్ని షేర్ చేయాల్సి ఉంటుంది.



Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!


క్రాస్ చెక్
చెక్ (Cheque) పేమెంట్స్ చేయడానికి ముందు ఈ వివరాలను మ్యాచ్ చేసి క్రాస్ చెక్ చేస్తారు. అవి మ్యాచ్ అయితేనే పేమెంట్ చేస్తారు.


పెద్ద మొత్తం ఉంటే
రూ.50 వేలకు మించిన చెక్ పేమెంట్స్‌పై జరిగే మోసాలను (Fraud) సులువుగా గుర్తించడం జరుగుతుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook