Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. 7 మంది మృతి, 26 మందికి గాయాలు!
Road Accident: కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. హుబ్లీ నగర శివార్లలో ఓ ట్రావెల్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు. ఇదే విషయాన్ని కర్ణాటక పోలీసులు తెలియజేశారు. కొల్హాపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు లారీని ఢీ కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ధార్వాడ్ వైపు వెళ్తోన్న లారీని బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం రాత్రి 12.30 నుంచి 1 గంట మధ్యలో జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
అక్కడికక్కడే డ్రైవర్లు మృతి..
ఈ ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో స్థానికులు సహాయం చేశారు.
ప్రమాదంపై సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే సమయంలో, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
ధార్వాడ్ లో మరో ప్రమాదం..
కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఇటీవలే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో 7 మంది మరణించారు. వేగంగా వెళ్తున్న కారు బ్యాలెన్స్ తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహానికి హాజరైన వారంతా తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది కూడా గాయపడ్డారు.
Also Read: Singer Murder: గాయని దారుణ హత్య.. ఒంటిపై కేవలం లోదుస్తులు... 12 రోజుల క్రితం మిస్సింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook