Rajasthan‌ Crime news: రాజ‌స్థాన్‌లోని జైపూర్‌(Jaipur)లో ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్‌(Five Star hotel)లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన అభరణాలు, రూ. 95 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ ఘటన హోట‌ల్ క్లార్క్స్ అమెర్‌లో గురువారం చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన వ్యాపారవేత్త రాహుల్‌ భాటియా(rahul bhatia) కుమార్తె వివాహాన్ని ఈ హోటల్‌లో నిర్వహిస్తుండగా.. ఆ కుటుంబం ఏడో అంతస్తులోని ఓ గదిలో బస చేసింది. వారంతా హోటల్‌ ప్రాంగణంలో పెళ్లి వేడుకకు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. 


Also read: Mill worker dies : సహోద్యోగుల సరదా వల్ల గాల్లో కలిసిన నిండు ప్రాణం


హోటల్‌ సిబ్బంది సహకారంతోనే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భాటియా పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై హోట‌ల్ యాజ‌మాన్యం ఇంకా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook