న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో చేరారు ( Sonia Gandhi Admitted to Hospital). సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరినట్టు ఆస్పత్రి మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్‌ డీఎస్‌ రానా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని రానా పేర్కొన్నారు. ఈమేరకు మీడియాకు రానా ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. Also read: COVID-19 in AP: 24 గంటల్లో 68 మంది మృతి


ఇదిలావుంటే, ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్‌ మీటింగ్‌లో ( Virtual meeting) పాల్గొన్న సోనియా గాంధీ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కరోనావైరస్ వ్యాప్తి నివారణకు పార్టీ తరపున నేతలు తీసుకుంటున్న చర్యలపై వారితో చర్చించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. Also read: రష్యా యుద్ధ విమానాలను అడ్డుకున్న మరో యుద్ధ విమానం