రాయ్‌బరేలి: యూపిఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూతురు, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా, అల్లుడు రాబర్ట్ వాద్రా సమక్షంలో ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకన్నా ముందుగా రాయ్‌బరేలిలో ఆమె హోమం చేసి యజ్ఞం నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా తరలివెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు.


ప్రస్తుతం రాయ్ బరేలి ఎంపీగా వున్న సోనియా గాంధీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకుని కేంద్రంలో అధికారం సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.