చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే దివంగత నేత కరుణానిధి మృతిపై తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి అనుమానాలు వ్యక్తంచేశారు.  డీఎంకే పార్టీకి చెందిన అగ్రనేతల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం చివరి రెండేళ్లు ఆయన ఏమీ మాట్లాడలేకపోయారని తెలిసింది. ఒకవేళ ఆయనకి సరైన సమయంలో సరైన చికిత్స ఇప్పించి వుంటే, ఇవాళ ఎం.కే. స్టాలిన్ డీఎంకే పార్టీకి అధ్యక్షుడు అయ్యుండేవారు కాదని.. అందుకే స్టాలిన్ తన తండ్రి కరుణానిధిని ఇంట్లోనే ఖైదీని చేశారని స్టాలిన్‌పై తీవ్రవిమర్శలు గుప్పించారు.


కరుణానిధి మృతిపై సందేహాలు వ్యక్తంచేసిన పళనిస్వామి.. ఈ విషయంలో తమిళనాడు సర్కార్ విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలిలో పాల్గొని మాట్లాడుతూ పళనిస్వామి ఈ ఆరోపణలు చేశారు.