Karnataka road accident news: బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా గాయపడిన ఏడుగురిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధర్వాడ్‌కి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్వాడ్ జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ట్విటర్ ద్వారా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Covaxin: కరోనా టీకాలు వారికి మాత్రమే: భారత్ బయోటెక్ క్లారిటీ


ధర్వాడ్ జిల్లా కేంద్రాని‌కి 8 కిమీ దూరంలో రోడ్ క్రాసింగ్ వద్ద శుక్రవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. కర్ణాటకలోని ధావనగిరి నుంచి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం గోవాకు ( Goa ) వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని ధర్వాడ్ జిల్లా పోలీసులు తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook