Covid19 Vaccines: ఓ వైపు వ్యాక్సిన్ కొరతతో దేశ అల్లాడుతుంటే..మరోవైపు లక్షల డోసుల వ్యాక్సిన్ రోడ్డు పక్కన ఉండటం ఆందోళన కల్గిస్తోంది. 8 కోట్ల విలువైన వ్యాక్సిన్ డోసులున్న ట్రక్కు 12 గంటల్నించి అలాగే ఉంది..ఇవీ వివరాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ధాటికి పరిస్థితి దిగజారిపోతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నా..చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. వ్యాక్సిన్ కొరత కారణంగా చాలా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ (Vaccinatioin) నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ ట్రక్కులో 2.4 లక్షల డోసుల వ్యాక్సిన్ ఉండటం ఆశ్చర్యంగా మారింది. 


మధ్యప్రదేశ్‌లోని (Madhya pradesh)నర్శింగ్ పూర్ జిల్లాలోని కరేలీ బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన ఓ ట్రక్కు నిలిపి ఉంది. అది కూడా ఏకంగా 12 గంటల్నించి. అందులో ట్రక్ డ్రైవర్ గానీ సిబ్బంది గానీ ఎవ్వరూ లేరు. దాంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ట్రక్క్ డోర్ ఓపెన్ చేసి చూస్తే భారత్ బయోటెక్ (Bharat Biotech)కంపెనీకు చెందిన 2.4 లక్షల కోవ్యాగ్జిన్ ( Covaxin doses) డోసులున్నాయి. దీనివిలువ 8 కోట్ల రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ట్రక్కు ఎయిర్ కండీషన్ పనిచేస్తుండటంతో వ్యాక్సిన్ డోసులు సురక్షితంగానే ఉన్నాయి. ట్రక్కుపై ఉన్న డ్రైవర్ మొబైల్ నెంబర్ ట్రేస్ చేయగా..హైవే సమీపంలో చెట్ల పొదల్లో ఉన్నట్టు తేలింది. డ్రైవర్, క్లీనర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనేది ఆరా తీస్తున్నారు. 


దేశంలో గత 24 గంటల్లో ఇప్పటివరకూ అత్యధికంగా 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 15 కోట్ల 49 లక్షల 89 వేల 635 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 


Also read: Gujarat Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 16 మంది సజీవ దహనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook