Union minister's tested covid-19 positive: న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ( Coronavirus ) ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు సైతం కరోనా బారిన పడ్డారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్ ( Arjun Ram Meghwal), కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి ( kailash choudhary ) కి కరోనా సోకినట్లు నిర్థారించారు.  Also read: Bloomberg Billionaires Index: ముకేశ్ ఇప్పుడు నాలుగో స్థానంలో



ఈ మేరకు మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ట్విట్ చేసి సమాచారమిచ్చారు. మొదట కరోనా లక్షణాలు కనిపించగానే.. పరీక్ష చేయించుకున్నానని, కరోనా పాజిటీవ్‌గా తేలినట్లు ఆయన తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఎయిమ్స్‌లో చేరినట్లు ఆయన వెల్లడించారు. కైలాశ్ చౌదరి కూడా పరీక్ష చేయించుకుంటే.. పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అంతకుముందు హోంమంత్రి అమిత్ షా సైతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే.  Also read: August 15: కరోనా వారియర్లకు నివాళిగా..సారే జహాసే అచ్ఛా