Union Tourism Minister Prahlad Singh Patel tested Covid-19 positive: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus ) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకింది. తాజాగా మరో కేంద్ర మంత్రికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ సింగ్ ప‌టేల్‌ (Union Minister Prahlad Singh Patel ) కు కూడా క‌రోనా సోకింది. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని గురువారం ఉదయం వెల్లడించారు. కరోనా టెస్టు చేయించుకోగా.. తన రిపోర్టు పాజిటివ్‌గా వచ్చిందని.. మంగళవారం తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలంటూ.. ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్ చేశారు. Also read: Union minister Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే పార్ల‌మెంట్ స‌మావేశాలకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పలువురు కేంద్ర మంత్రులు.. 20మందికిపైగా ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ క్రమంలో సభలు కొనసాగుతుండగానే.. బుధవారం కేంద్ర ర‌వాణా శాఖ‌ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ( Union minister Nitin Gadkari ) కి క‌రోనా సోకిన మరునాడే. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ సింగ్ ప‌టేల్‌కు క‌రోనా నిర్ధార‌ణ కావడంతో సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది. Also read : MP Balli Durgaprasad Rao's death: గుండెపోటుతో వైసిపి ఎంపీ మృతి


Also read : Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు