బిఎస్‌ఎన్‌ఎల్‌ (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఆఫర్ తీసుకొస్తోంది. కెనడాకి చెందిన డేటా విండ్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒక ఎంఓయూ (మెమరెండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్‌)లో భాగంగా ఇండియన్ కస్టమర్ల కోసం ఒక్క రూపాయికే అన్ లిమిటెడ్ డేటా ఇవ్వడానికి ముందుకొస్తుంది. నెలకు రూ.30 టారిఫ్‌తో నెలంతా అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చని అంటోంది బీఎస్‌ఎన్‌ఎల్. జియో, ఎయిర్‌టెల్ లాంటి సంస్థలకు పోటీగా వస్తున్న ఈ ఆఫర్ ప్రభుత్వ రంగ సంస్థ చేస్తున్న ఓ కొత్త ప్రయోగమని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం డేటావిండ్ స్మార్టు ఫోన్ల వినియోగదారులకే ప్రత్యేకమని తెలిపింది బిఎస్‌ఎన్‌ఎల్‌. బహుశా ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ ఆఫర్ భారతీయ టెలికామ్ వినియోగదారులకు చేరనుందని తెలుస్తోంది.