Uttarakhand road accident: ఉత్తరాఖండ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పౌరీ జిల్లాలోని రిఖినికల్-బిరోఖాల్ రహదారిపై వెళ్తున్న ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతున్న నాయర్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది మృత్యువాత పడ్డారు. మిగతవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్యాసింజర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చీకటి కారణంగా సహాయచర్యలకు అంతరాయం కలుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా బాధితులను కాపాడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


ఉత్తరకాశీలో భారీ హిమపాతం.. 10 మంది పర్వతారోహకులు మృతి
ఉత్తరాఖండ్‌లో వాతావరణం ప్రతికూలంగా మారింది. భారీ వర్షం కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించగా, ఉత్తరకాశీలో 29 మంది పర్వతారోహకులు హిమపాతంలో చిక్కుకున్నారు. వారిని కాపాడాలని సీఎం పుష్కర ధామి భారత సైన్యాన్ని ఆశ్రయించారు. దీనిపై ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కూడా మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. తాజా నివేదిక ప్రకారం, అక్కడ ఇప్పటివరకు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ వెళ్లొద్దని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.  


Also Read: Mulayam singh Yadav: అత్యంత విషమంగా ములాయం సింగ్ ఆరోగ్యం.. అఖిలేశ్ ను పరామర్శించిన సీఎం కెసిఆర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook