ఇటీవల సంచలనం సృష్టించిన షెరినా మాథ్యూస్‌ మిస్టరీ వీడిందా? ఆ చిన్నారి సమీపంలోని డ్రైనేజీ టన్నెల్ లో శవంగా తేలిందా? టెక్సాస్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే.. ఈ విషయం నిజమేనేమో అని అనిపిస్తుంది. పాలు తాగలేదని మూడేళ్ళ చిన్నారిని అర్థరాత్రి ఇంటి బయట నిలబడమని శిక్షించాడు కన్న తండ్రి వెస్లీ మాథ్యూస్‌. కొద్దిసేపటికి వెస్లీ బయటకు వచ్చి చూస్తే పాప కనిపించలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు వెస్లీ.


రెండువారాల అనంతరం మాథ్యూస్‌ ఇంటికి సమీపంలోని డ్రైనేజీ టన్నెల్ లో ఒక మృతదేహంను టెక్సాస్ పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం వయసు కూడా మూడు సంవత్సరాలు కావడంతో ఇది షెరిన్  మాథ్యూస్‌ దేనని అనుమానిస్తున్నారు. పాపను బయట నిలబెట్టినందుకు వెస్లీని పోలీసులు అరెస్ట్ చేశారు.  షెరిన్ మాథ్యూస్‌ భారతదేశంలో పుట్టింది. ఆ చిన్నారిని వెస్లీ మాథ్యూస్‌ అనాథ శరణాలయం నుంచి దత్తత తీసుకొని అమెరికా తీసుకెళ్లాడు.