DA Hike 2024: ఈ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒకేసారి డబుల్ బోనస్..!

Tue, 24 Sep 2024-1:03 pm,

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఏడాది రెండో డీఏ 3 శాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. కేంద్రం ప్రకటన తరువాత జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.  

ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకేసారి డబుల్ జాక్‌పాట్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

ఈ ఏడాది మార్చి నెలలో స్టాలిన్ సర్కారు 4 శాతం డీఏను పెంచిన విషయం తెలిసిందే. పెంచిన డీఏ జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది.  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో డీఏ ప్రకటన కూడా దీపావళి సందర్భంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి డీఏ పెంపుతోపాటు దీపావళి బోనస్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

ఇందుకు సంబంధించిన ఫైల్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఎం స్టాలిన్ గ్రీన్‌సిగ్నల్ తరువాత అధికారిక ప్రకటన రానుంది.    

మరోవైపు యూపీలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 15 లక్షల మంది ఉద్యోగులు, 8 లక్షల మంది పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పనుంది.  

దీపావళి గిఫ్ట్‌గా 4 శాతం డీఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్‌ల కూడా ప్రకటించవచ్చని చెబుతున్నారు.  

ఇందుకు సంబంధించిన ప్రకటన సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.  

డీఏ పెంపుతో రాష్ట్ర ఖజానాపై రూ.3 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు గతంలో రూ.7 వేలు బోనస్ ఇవ్వగా.. ఈ ఏడాది బోనస్ స్వల్పంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link