7th Pay Commission Latest Update: డీఏ పెంపుపై క్లారిటీ, జూలై నుంచి ఎంత డీఏ పెరుగుతుంది, ప్రకటన ఎప్పుడుంటుంది

Sun, 04 Aug 2024-12:18 pm,

అయితే ఈ విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. డీఏను జీరో చేయరు. అంటే బేసిక్ శాలరీలో కలిపే పరిస్థితి లేదు. డీఏ మొత్తం 53-54 శాతానికి చేరుకుని ఆపై కూడా అలానే కొనసాగనుంది. 

7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం డీఏ 50 శాతం దాటితే మొత్తం డీఏను బేసిక్ శాలరీలో కలిపి తిరిగి జీరో నుంచి లెక్కిస్తారు. ఇప్పుడు జూలై నెల డీఏ పెంపు ప్రకటన వెలువడితే డీఏ 53-54 శాతం చేరుకోవచ్చు. అంటే బేసిక్ శాలరీలో కలపాల్సి ఉంటుంది. 

ఈసారి జూలై నెలలో డీఏ ఇప్పటి వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం 3 శాతం ఉండవచ్చు. జూలై నెల డీఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ నెలలో ఉండవచ్చని తెలుస్తోంది. జనవరి నెల ఏఐసీపీఐ సూచీ 138.9 కాగా ఫిబ్రవరిలో 139.2 ఉంది. మార్చ్ నెలలో 138.9 కాగా ఏప్రిల్ నెలలో 139.4 ఉంది. మే నెలలో 52.91 ఉంది. 

7వ వేతన సంఘం ప్రకారం ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంది. జనవరి నెల డీఏ పెంపు ప్రకటన మార్చ్ నెలలో వెలువడింది. మార్చ్ నెలలో డీఏ 4 శాతం పెరగడంతో మొత్తం 50 శాతానికి చేరుకుంది. 

ఏఐసీపీఐ జూన్ నెల సూచీ వచ్చేసింది. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ 3 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. జూలై నెల నుంచి ఈ డీఏ పెంపు అమల్లోకి వస్తే మొత్తం డీఏ 53 శాతానికి చేరుకోనుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link