8Th Pay Commission New Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని శుభవార్త.. DAతో పాటు జీతం, పెన్షన్‌ రూ.17 వేల పెంపు!

Tue, 01 Oct 2024-4:43 pm,

2016లో ఎవడ వేతన సంఘంను అమలు వచ్చింది. ఈ సంఘం ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉంటే త్వరలోనే 8th pay commission అమలులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. 

ఎనిమిదో వేతం సంఘం వల్ల కేంద్ర ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ 8వ వేతనం అమలు చేయబడితే  ఉద్యోగుల కనీస జీతం రూ.18,000 నుంచి రూ.34,560కి పెరుగుతుంది. దీంతో పాటు  పెన్షన్‌ రూ.17,280కి పెరగవచ్చు. 

 కేంద్ర ప్రభుత్వం 2026 జనవరిలో ఎనిమిదో  వేతన సంఘాన్ని ప్రకటించవచ్చని అటు మీడియా నివేదికలు, ఆల్ ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ శివగోపాల్‌ మిశ్రా బల్లగుద్ది  చెప్పారు.   

8వ వేతన సంఘం విషయంలో కేంద్ర ప్రభుత్వం  త్వరలో నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఒకవేళ 8th pay commission అమలులోకి వస్తే రైల్వే ఉద్యోగులకు కూడా భారీగా లబ్ధి చేకూరనుంది. అలాగే కోటి మందికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షన్ ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని నిపుణులు తెలుపుతున్నారు..

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ ను నాలుగు శాతం ప్రకటిస్తే  రాష్ట్ర ఖజానాపై రూ.3,000 కోట్ల అదనపు భారం పడుతుందని  అంచనా వేస్తున్నారు.  

UP ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతే 8 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link