Pragya Jaiswal: పాయల్ రాజ్‌పుత్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రగ్యా జైస్వాల్

Thu, 31 Dec 2020-3:27 pm,

Green India Challenge: టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించింది. నటి పాయల్ రాజ్‌పుత్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Gallery: Pragya Jaiswal Photos: అందాల ‘కంచె’లో బిగిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

రాజ్యసభ సభ్యుడు జోగిన్‌పల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) కొనసాగుతోంది. సినీ, రాజకీయ, క్రీడా, సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రముఖులు ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు అవుతున్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రగ్యా జైస్వాల్ మూడు మొక్కలు నాటారు. సాధ్యమైనంతగా పచ్చదనాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చింది.

Gallery: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు

టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ రెజీనాను, యోగా ట్రైనర్ అనుష్కకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరింది ప్రగ్యా జైస్వాల్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link