Gujarat Drugs Seized: గుజరాత్ తీరంలో డ్రగ్స్ కలకలం.. 5వేల కోట్ల మాదక ద్రవ్యాల సీజ్..

Mon, 14 Oct 2024-11:55 am,

Gujarat Drugs Seized: ఇటీవల దేశ రాజధాని దిల్లీలోనూ కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండు ఘటనల్లో వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు.

దేశ రాజధాని తర్వాత గుజరాత్ తీరంతో నార్కోటిక్ పోలీసులు 518 కిలోల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు.  అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 5వేల కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పోలీసులు అంక్లేశ్వర్‌లోని ఓ కంపెనీలో తనిఖీలు నిర్వహించగా.. ఈ మేరకు భారీ స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.

ఢిల్లీ పోలీస్, గుజరాత్‌ పోలీసులు ఆదివారం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టి దాదాపు 518 కిలోల కొకైన్‌ను ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

అక్టోబర్‌ 1న స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఢిల్లీలోని మహిపాల్‌పుర్‌లోని గోదాంలో సోదాలు జరిపి.. 562 కేజీల కొకైన్‌, 40కిలోల హైడ్రోపోనిక్‌ మారిజునాను సీజ్‌ చేశారు.

ఈ కేసు దర్యాప్తులో వచ్చిన సమాచారం ఆధారంగా అక్టోబర్‌ 10న ఢిల్లీలోని రమేశ్‌ నగర్‌ ప్రాంతంలోని ఓ షాప్‌లో దాడులు చేసి 208కిలోల కొకైన్‌ను సీజ్‌ చేసినట్లు పోలీసు వర్గాలు ఇటీవల వెల్లడించాయి.

కేవలం 15 రోజుల వ్యవధిలో ఢిల్లీ, గుజరాత్‌లలో దాదాపు 13వేల కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link