AP Liquor: వైన్‌షాప్‌ల వద్ద మందుబాబులకు షాక్‌.. ధరలు చూస్తే కిక్కు దిగిపోద్ది

Wed, 16 Oct 2024-8:54 pm,

కొత్త బ్రాండ్లు రూ.99కే లభిస్తుందని ఎంతో ఆశతో మందుబాబులకు వైన్స్ వద్ద భంగపాటు ఎదురైంది.

ఆంధ్రప్రదేశ్‌ తీసుకొచ్చిన కొత్త మద్యం విధానంతో ధరలు భారీగా తగ్గుతాయని ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబు రూ.99కే క్వార్టర్‌ మందు అని ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు తెరచుకోవడంతో ఎంతో ఉత్సాహంతో మందుబాబులు వైన్స్‌కు ఎగబడ్డారు.

తక్కువ ధరకే మద్యం దొరుకుతుందని భావించి వైన్‌షాపులకు వెళ్లిన మందుబాబులకు తీవ్ర నిరాశ ఎదురైంది. 

ఎక్కడ కూడా రూ.99కే క్వార్టర్ బాటిల్ మందు లభించలేదు. దీంతో మందుబాబులు తీవ్ర నిరాశ చెందారు.

మద్యం వ్యాపారులను నిలదీయడంతో ఇంకా ఆ బ్రాండ్లు రాలేదని సమాధానం ఇచ్చారు.

ఇక గత్యంతరం లేక మందుబాబులు రూ.120, రూ.150, రూ.180 చెల్లించి క్వార్టర్ బాటిళ్లు తీసుకెళ్తున్నారు.

గతంలో కంటే మద్యం ధరల్లో పెద్దగా మార్పు రాలేదని మందుబాబులు చెబుతున్న మాట. ధర తక్కువ లేకున్నా తమకు ఇష్టమైన బ్రాండ్లు దొరుకుతున్నాయని మందుబాబులు సంతోషిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link