Holidays 2024: మరో బంపర్ ఆఫర్.. రేపు కూడా అన్ని ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులకు హలీడే.. ఎందుకో తెలుసా..?

Wed, 02 Oct 2024-10:19 am,

దసరా సంబరాలు మొదలయ్యాయి. దేశంలో దసరా పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు భారీ ఎత్తున హలీడేలు కూడా ప్రకటిస్తుంటాయి.

ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు హలీడేలను డిక్లెర్ చేశాయి. అక్టోబరు 3 నుంచి 12 వరకు దసరాల సెలవులను పలు స్టేట్స్ లను ప్రకటించాయి. దీంతో స్కూల్స్,కాలేజీ విద్యార్థులు ఇంటికి వెళ్లిపొయేందుకు రెడీ అయిపోతున్నారు.  

ఈ నేపథ్యంలో ఈరోజు (బుధవారం) గాంధీ జయంతి నేపథ్యంలో దేశమంతాట ఇప్పటికే హలీడే ఉన్న విషయం తెలిసిందే. మనదేశానికి ఇండిపెండెన్స్ డే తీసుకుని రావడంలో మహత్మ గాంధీ ఎంతో పాటు పడిన విషయం తెలిసిందే. అందుకే ఆయనను జాతీపిత అంటారు.

అదే విధంగా ఈసారి గాంధీ జయంతి నేపథ్యంలో అక్టోబరు 2 తోపాటు, అక్టోబరు 3 కూడా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు కూడా సెలవులు ఉండబోతున్నాయి. ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

అక్టోబర్ 3న మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా సెలవును ప్రకటించినట్లు తెలుస్తోంది. మహారాజ అగ్రసేన్ జయంతిని.. పంజాబ్ , హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లలో నిర్వహిస్తారు.

ఈ పండుగను వైశ్య కమ్యూనిటీ వారు మతపరమైన భక్తితో జరుపుకుంటారు. అగ్రవాల్, జైన, అగ్రహరి వర్గాలతో సహా మహారాజా అగ్రసేన్ వారసులకు ఇది ఒక పవిత్రమైన రోజుగా చెప్తుంటారు. దేశంలో ఐక్యత, సామరస్యం, సామాజిక సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారని చెబుతుంటారు.

అందుకే అగ్రసేన్ ను గుర్తుచేసుకుంటూ ఈరోజు కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేకంగా, ప్రార్థనలు, ఊరేగింపులు, సమాజ సమావేశాలతో పండుగను జరుపుకుంటారు . అందుకే ఈరోజున బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు భగవంత్ మాన్ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link