Andaman Tour: వర్షాకాలంలో అత్యంత మనోహరమైన టూరిస్ట్ ప్రాంతమిదే, ఐఆర్సీటీసీ నుంచి ప్రత్యేక ప్యాకేజ్

Fri, 04 Aug 2023-5:17 pm,

5-11 ఏళ్ల పిల్లలుంటే ప్రతి బెడ్‌తో పాటు 50,200 రూపాయలు, బెడ్ లేకుండా 46,500 రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి చెల్లించాలి. అదే 2-4 ఏళ్ల పిల్లలైతే ఒక్కొక్కరికి 36,700 చెల్లించాలి. 

ఐఆర్సీటీసీ ప్రారంభిస్తున్న ఈ  టూర్ ప్యాకేజ్ చాలా తక్కువకే అందుబాటులో ఉంది. మీరు ఒక్కరే ఇవన్నీ తిరిగి రావాలంటే 69,300 చెల్లించాలి. అదే డబుల్ అయితే 55,500 రూపాయలుంటుంది. ఇక త్రిబుల్ అయితే 55 వేలు ప్రతి వ్యక్తికి చెల్లించాలి.

ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ టూర్ ప్యాకకేజ్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజ్ పేరు WONDROUS ANDAMAN WMA45.ఇందులో ప్రయాణీకులు కంఫర్ట్ తరగతిలో ప్రయాణిస్తారు. ఈ ప్యాకేజ్‌ మూడు రోజులు పోర్ట్ బ్లయర్, ఒక రాత్రి హ్యావ్లాక్ ఐల్యాండ్‌లో , ఇంకో రాత్రి నీల్ ఐల్యాండ్‌లో నివాసముంటారు. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 10 వరకూ ఉంటుంది. 

ఈ టూర్ ప్యాకేజ్ 5 రాత్రులు, 6 రోజులకు ఉంటుంది. ఇందులో పోర్ట్ బ్లయర్, హ్యావ్లాక్ ఐల్యాండ్, నీల్ ఐల్యాండ్ తిరిగి రావచ్చు. ఈ యాత్ర ముంబై నుంచి ప్రారంభం కానుంది. 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. 

ఐఆర్సీటీసీ కొత్తగా అండమాన్ టూర్ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. దీనిద్వారా చాలా చౌకగా అండమాన్ ఐల్యాండ్ పర్యటించి రావచ్చు. ఈ టూర్ ప్యాకేజ్‌లో అండమాన్‌లోని వేర్వేరు సముద్రతీర ప్రాంతాలు తిప్పుతారు. ఈ ప్రయాణమంతా విమానం ద్వారా ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link