Bollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్..

Tue, 28 May 2024-9:04 pm,

కరీనా కపూర్.. బాలీవుడ్‌ను శాసించిన.. శాసిస్తున్న కపూర్ కుటుంబానికి చెందిన కుమార్తె. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్‌కపూర్ మనవరాలు.. రణ్‌ధీర్ కపూర్, బిబతల కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

కరీనా కపూర్ 1980లో జన్మించింది. ఆమె అక్క కరిష్మా కపూర్  కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఓసారి రణ్‌ధీర్ కపూర్ 'ది కపిల్ శర్మ షో'లో 80లలో తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను ఎదుర్కొన్నాడు.

అప్పట్లో తన ఇద్దరు కూతుళ్ల స్కూల్ ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బు లేదని రణ్‌ధీర్ కపూర్ చెప్పాడు. 2011లో కూడా కరీనా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. సినిమాల మూలంగా వచ్చిన నష్టాలతో తమ కుటుంబం ఎదుర్కొన్న ఆర్ధిక కష్టాలను వెల్లడించింది.

కరీనా కపూర్.. 2000లో అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన 'రెఫ్యూజీ' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అగ్ర కథానాయికగా దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటిగా ఎదిగింది.

 

ఇప్పటికీ కరీనా కపూర్ ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల నుంచి రూ. 18 కోట్లు తీసుకుంటుందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కరీనా కపూర్ నెట్ వర్త్ ఆస్తుల విలువ రూ. 480 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

2012లో తన తోటి నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె బేగం ఆఫ్ పటౌడీగా మారింది.

ప్రస్తుతం కరీనా కపూర్ నివాసం ఉంటున్న పటౌటీ ప్యాలెస్ విలువ దాదాపు రూ. 800 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అందులో తన భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link